VijayaKumar

May 01 2024, 14:40

అరూరు గ్రామంలో ఇంటింటికి బిజెపి ప్రచారం


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 19:08

తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోరిన అతహర్


మే 27వ తేది న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న కు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రయివేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగణబోయిన మల్లేశం ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యావేత్త మహమ్మద్ అతహర్. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో ప్రజలను, విద్యావంతులను, విద్యార్థులను చైతన్య పరిచిన యువ నాయకుడు తీన్మార్ మల్లన్న అని అలాంటి వారిని చట్ట సభల్లోకి పంపవలసిన భాద్యత మనందరి పై ఉందని అన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా కు చెందిన వాడు కావడం భువనగిరి లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాల లో చదువుకోవడం వలన ఇక్కడి ప్రజలతో మంచి సంభంధాలు ఉన్నాయని అన్నారు. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ విధిగా తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

VijayaKumar

Apr 30 2024, 16:44

పది ఫలితాలలో పవిత్రాత్మ విద్యార్థుల ప్రభంజనం, 10 GPA సాధించిన పొట్టి పల్లి గీతిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పొట్టిపల్లి గీతిక పదికి పది పాయింట్లు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం నిలిచి పాఠశాల ఘనతను చాటి చూపించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జయంతి మాట్లాడుతూ కష్టపడి చదివితే వారికి ఫలితం ఎక్కడ పోదని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ పాఠశాల కీర్తిని చాటినందులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, గీతిక తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాండు, బాల శౌరి ,వెంకటేశం, మిల్క్ రాజ్, ఉమాదేవి, పద్మ ,సుందరి, కల్పన తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 16:28

ప్రజల పక్షాన పోరాడే సిపిఎం ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు


అవినీతికర బిజెపిని అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం గెలిపించండి

    - సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు*

     అవినీతిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న బిజెపిని, అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జాహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ అవినీతిపై పోరాటం చేస్తానన్న మోడీ ఇప్పుడు దేశంలో అత్యంత అవినీతి పార్టీగా బిజెపిని మార్చాడని విమర్శించారు. పైలెట్ జెట్ విమానాల కొనుగోలు, మైనింగ్ లీజు, ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో వేలకోట్ల దందా నడిపి కోట్లాది రూపాయలు కూడేసుకుని అవినీతినే బిజెపి చట్టబద్ధత చేసి లక్షల కోట్ల రూపాయలలో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. మరోపక్క కార్పొరేట్ శక్తులకు, అవినీతిపరులకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారా దత్తం చేశారని ఆవేదన వెలుబు ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల పైన మహిళల పైన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ, నిత్యవసర ధరలు పెంచడం లాంటివి బిజెపి పాలనలో పెరిగిపోయాయి అని అన్నా. మరో మారు దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వత్వం పెరుగుతుందని, రాజ్యాంగం, రిజర్వేషన్లు లేకుండా చేస్తారని అందుకే ఓటుతో బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హక్కులను అమలు చేయాలని, సాగు తాగునీరు అందించాలని, విద్యా, వైద్యము అందరికి అందాలని పోరాడుతున్న సిపిఎం సిపిఎం తరఫున పోటీ చేస్తున్న ఎండి. జహంగీర్ గారిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి గెలిపించాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పాల్గొని మాట్లాడగా ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, ఎల్లముల వెంకటేష్, పాండాల మైసయ్య, కొండాపురం యాదగిరి, జిట్టా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

        

VijayaKumar

Apr 30 2024, 15:52

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి


దేశం మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు.భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ గుండాల మండలం వంగాల గ్రామం  272 వ బూతులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి మాట్లాడుతూ... వారసత్వ రాజకీయాలు అవినీతి పాల్పడే పార్టీలు ప్రజల అభివృద్ధి చేయలేవని, ప్రజలకు తెలియజేప్పుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు.మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. మరోసారి బిజెపిని గెలిపించి అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు సింగారం, గంగాపురం రమేష్, ఇమ్మడి నాగరాజు, ఆవుల సాయితేజ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 14:19

లోతుకుంట లో ఇంటింటికి బిజెపి ప్రచారం


భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 30 2024, 14:13

SSC - 2024 పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట తెలంగాణ మోడల్ స్కూల్ లో SSC - 2024  పరీక్షా ఫలితాలలో విద్యార్థులు 90.5% సాధించినట్లు ప్రిన్సిపాల్ జి రాము ఒక ప్రకటనలో తెలిపారు.

రేఖ మమత 9.5, జినుకల ప్రత్యూష 9.3, కొమిరెల్లి స్పందన 9.3 , గోగు మయూరి 9.0 GPA లు సాధించారని అన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ ,ఉపాధ్యాయులు కే పరమేష్ ,కే అనసూయ, ఈ పూర్ణిమ, బి పృధ్విరాజ్, జెంతిలాల్, వెంకటేశం ,ఐలయ్య మరియు లింగస్వామి అభినందించారు.

VijayaKumar

Apr 30 2024, 11:52

రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్ డయాసిస్ ఆఫ్ కరీంనగర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి సిఎస్ఐ సంఘ పెద్దలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామానికి చెందిన సిఎస్ఐ చర్చ్ సంఘ పెద్దలు రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్, డయాసిస్ ఆఫ్ కరీంనగర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సహకారం అందించాల్సిందిగా కోరామని తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి కాంపౌండ్ వాల్ నిర్మాణ కోసం తగిన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ రెవరెండ్ రాజారత్నం, స్థానిక పాస్టర్ విద్యాసాగర్, మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు సంఘ పెద్దలు రావుల డానియల్ డిసిసి మెంబర్ సంగిశెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 29 2024, 21:22

ఎర్రజెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు అభివృద్ధి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


   ఎర్ర జెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తెలియజేసినారు. సోమవారం భువనగిరి మండల వ్యాప్తంగా సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ గారి గెలుపును కోరుతూ నిర్వహించే ప్రచార జాతాను సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యా, వైద్యం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని గత మూడు దఫాలుగా గెలిచిన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, సమస్యల పరిష్కారం గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా నడికుడి నుండి బీబీనగర్ వరకు సింగిల్ లైన్ తో రైల్వే మార్గం ఏర్పడిందని కానీ ఈ పాలకులు డబుల్ లైన్ వేసేకాడ అన్ని స్టేషన్లను అభివృద్ధి చేసి అన్ని ట్రైన్లను ఆపే కాడ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భువనగిరి జిల్లా కేంద్రమైన నేటికీ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు లేవని ఎందుకు గత పాలకులు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పేరుకే బీబీనగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఇంకా అన్ని రకాల వైద్యము అందడం లేదని బిజెపి ఎయిమ్స్ హాస్పిటల్ కు నిధులు కేటాయించెదాంట్లో వివక్షత చూపుతుందని విమర్శించారు. భువనగిరి ప్రాంతం విద్య పరంగా, వైద్యపరంగా, ఉపాధిపరంగా, సాగు తాగునీరు సమస్య పరిష్కారం కావాలంటే, ఈ ప్రాంతము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడే నాయకుడు, ప్రశ్నించే నాయకుడు జహంగీర్ గారు గెలవాలని, వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తని ఆ గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్, కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వరక సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు పల్లెర్ల అంజయ్య, గుమ్మడి రాజు నరేష్, సాయి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

        

VijayaKumar

Apr 29 2024, 21:17

పొద్దుటూరు లో సిపిఎం ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య


 సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ గారి ఎన్నికల ప్రచార వాహనాన్ని ఈరోజు పొద్దుటూరు గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార వాహనం పొద్దుటూరులో ప్రారంభమై ఏదులగూడెం,టేకుల సోమారం,రెడ్ల రేపాక,దాసిరెడ్డిగూడం,వలిగొండ,నాగారం,నెమలి కాలువ,గోల్నేపల్లి,జాలుకాలువ  గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండలకార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కురి రామచందర్,కూర శ్రీనివాస్,మండల కమిటి సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, కవిడే సురేష్,వలిగొండ పట్టణ కార్యదర్శి గార్దసు నర్సింహ,సింగిల్ విండో మాజీ డైరక్టర్ పలుసం బాలయ్య,శాఖ కార్యదర్శి పలుసం లింగం,పిఎన్ఎం జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు గంటేపాక శివ,ఈర్లపల్లి ముత్యాలు,నాయకులు వేముల నాగరాజు,ఆకుల రాజు,పరమేష్,వేముల జ్యోతి బస్,నాయకులు గడ్డం సుదర్శన్,పెద్దబోయిన శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.